భారత్ లో కరోనా విజృంభణ...

- October 11, 2020 , by Maagulf
భారత్ లో కరోనా విజృంభణ...

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. రోజువారి కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉంది... తాజా కేసులతో కలుపుకొని 70 లక్షల మార్క్‌ను కూడా క్రాస్‌ చేశాయి పాజిటివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 74,383 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. 918 మంది మృతిచెందారు.. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 70,53,807కు చేరుకోగా.. ఇప్పటి వరకు 60,77,977 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 8,67,496 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 1,08,334 మంది మృతిచెందినట్టు తన బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. కరోనా రోగుల రికవరీ రేటు 86.17 శాతానికి పెరగగా.. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.30 శాతంగా ఉన్నాయి.. ఇక, మరణాల రేటు 1.54 శాతానికి తగ్గినట్టు కేంద్రం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com