భారత్ లో కరోనా విజృంభణ...
- October 11, 2020
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. రోజువారి కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉంది... తాజా కేసులతో కలుపుకొని 70 లక్షల మార్క్ను కూడా క్రాస్ చేశాయి పాజిటివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 74,383 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 918 మంది మృతిచెందారు.. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 70,53,807కు చేరుకోగా.. ఇప్పటి వరకు 60,77,977 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 8,67,496 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 1,08,334 మంది మృతిచెందినట్టు తన బులెటిన్లో పేర్కొంది సర్కార్. కరోనా రోగుల రికవరీ రేటు 86.17 శాతానికి పెరగగా.. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.30 శాతంగా ఉన్నాయి.. ఇక, మరణాల రేటు 1.54 శాతానికి తగ్గినట్టు కేంద్రం పేర్కొంది.
తాజా వార్తలు
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- హైదరాబాద్లోని హోటల్ లో పేలుడు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష









