ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
- October 12, 2020ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్(87) కన్నుమూశారు. 1933లో మైసూర్ శివరాంపేట్లో జన్మించిన రాజన్.. సోదరుడు నాగేంద్రతో కలిసి పలు ప్రముఖ చిత్రాలకు సంగీతం అందించారు. వీరి ద్వయంలో వచ్చిన ఆల్బమ్స్ అన్నీ హిట్టే. రాజన్- నాగేంద్ర ద్వయంగా పాపులర్ అయిన వీరు 37 సంవత్సరాల పాటు సంగీత సేవలు అందించారు.
తెలుగుతో పాటు కన్నడ, తమిళ చిత్రాలకు సంగీతం అందించిన రాజన్ నాగేంద్ర 60కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. అగ్గి పిడుగు, పూజ, ఇంటింటి రామాయణం, నాలుగు స్తంభాలాట, పంతులమ్మ, మూడుముళ్ళు, ప్రేమ ఖైదీ, సొమ్మొకడిది సోకొకడిది, రెండు రెళ్ళు ఆరు, నాగమల్లి, పులి బెబ్బులి, కిలాడీ దొంగలు, ఆడపడుచు, రౌడీ పోలీస్ సీత పుట్టిన దేశం, అప్పుల అప్పారావు, చూపులు కలిసిన శుభవేళ, వయ్యారి భామలు వగలమారి భర్తలు తదితర చిత్రాలకు రాజన్ సంగీతం అందించారు. ఆయన మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్