వరదల్లో మరణించిన వారి కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేసిన టి.హోం మంత్రి
- October 17, 2020హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు శనివారం నాడు చెక్కులు పంపిణీ చేశారు.పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, శాసన సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమస్య శాశ్వత పరష్కారానికి కృషి చేస్తున్నా రన్నారు. భారీ వర్షాల తో దాదాపు 12 మంది పాత బస్తి లోని వరదల్లో చనిపోయా రన్నా రు. చనిపోయిన వారి ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెక్కును పంపిణీ చేశారు. బహదూర్ పుర కు చెందిన అనాస్ బేగం, ఫరా బేగం మరియు కనిజ్ బేగం కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు.. కొంతమంది మరణించిన వారి కుటుంబ సభ్యులు హాజరు కాలేక పోయారు. వారి చెక్కులు MRO కి అప్పగిం చారు.అక్టోబర్ 13 మరియు 14 వ తేది లలోని వర్షాలలో తమ ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని హోం మంత్రి గుర్తు చేశారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం