కువైట్-భారత్ మధ్య వాణిజ్య, ఆర్ధిక సంబంధాల బలోపేతంపై చర్చ
- October 27, 2020
కువైట్ సిటీ:కువైట్ తో పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టిసారించిన భారత్..ఇప్పటికే పలు శాఖల మంత్రలతో చర్చలు జరిపింది. తాజాగా కువైట్ వాణిజ్య, ఆర్ధిక చాంబర్ డైరెక్టర్ జనరల్ తో కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్ధిక పరమైన సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా చర్చలు జరిపారు. పారిశ్రామికాభివృద్ధికి పరస్పరం సహరించుకునే అంశాలపై ఈ భేటీలో డిస్కస్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కువైట్ లో పలు భారతీయ కంపెనీలు తమ సంస్థ శాఖలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్&టీ, షాపూర్జీ పల్లోంజీ, కల్పతరు పవర్ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్, టీఈఆర్ఐ, ఎస్సార్ ప్రాజెక్ట్స్, సింప్లెక్స్ ప్రాజెక్ట్స్ లాంటి ఈపీసీ తరహా కంపెనీలతో పాటు టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి ఐటీ సంస్థలు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!