ఆస్ట్రేలియా టూర్ కి భారత జట్ల ఎంపిక..
- October 27, 2020
ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే, టీ20, టెస్టు జట్లను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ ల కోసం ఐపీఎల్లో కండరాల గాయం వల్ల గత రెండు మ్యాచ్లకు దూరమైన రోహిత్ శర్మతో పాటు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లను సునీల్ జోషి నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పరిమిత ఓవర్ల సిరీస్ ల్లో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో లోకేష్ రాహుల్ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకోగా ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున అదరగొడుతున్న లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తొలి సారి జాతీయ జట్టులో స్థానం కల్పించింది. అయితే కొవిడ్-19 నేపథ్యంలో బయో బబుల్ ను దృష్టిలో పెట్టుకొని సెలెక్షన్ కమిటీ జంబో జట్లను ప్రకటించింది. ఐపీఎల్ అనంతరం సిడ్నీ వెళ్లనున్న భారత జట్టు అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి నవంబర్ 27న తొలి వన్డే ఆడనుందన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి