దుబాయ్:సామూహిక వేడుకలు, సెలబ్రేషన్స్ నిర్వహణపై మార్గనిర్దేశకాలు జారీ
- October 29, 2020
దుబాయ్:రాబోయే కాలంలో వచ్చే పండుగలు, ఇతర సామూహిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దుబాయ్ విపత్తుల నిర్వహణకు చెందిన సుప్రీం కమిటీ కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది. రాబోయే హాలోవీన్ తో దీపావళి పండగ సంబరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, కోవిడ్ నిబంధనలు అన్ని పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించింది. కోవిడ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది సమాజంలోని ఇతర ప్రజల ఆరోగ్యానికి హానీ చేయటమేనని సుప్రీం కమిటీ అభిప్రాయ పడింది. సామూహిక కార్యక్రమాలకు వీలైనంత వరకు వెళ్లకపోవటమే మంచిదని..ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పకుండా ఫేస్ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాల్సిందేనని వెల్లడించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించొద్దని హెచ్చరించింది. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!