కోవిడ్ 19: అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేకాలు జారీ
- November 04, 2020అబుధాబి:అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. అబుధాబి మీదుగా యూఏఈకి చేరుకునే పౌరులు, ప్రవాసీయులతో పాటు అబుధాబి నివాసితులు సైతం కోవిడ్ టెస్ట్ చేయించుకున్న 48 గంటల్లో అబుధాబి చేరుకోవాలని అబుధాబి కోవిడ్ 19 అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. పీసీఆర్ టెస్ట్ చేయించుకోని వారు డీపీఐ లేసేర్ టెస్ట్ రిపోర్ట్ ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు..అబుధాబిలో నాలుగు రోజులు ఉండే వారు తప్పనిసరిగా నాలుగో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అబుధాబిలో అడుగుపెట్టిన రోజును తొలి రోజుగా పరిగణిస్తారు. అంటే ఆదివారం అబుధాబికి చేరుకుంటే బుధవారం రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎనిమిది రోజులకు మించి అబుధాబిలో ఉంటే 8వ రోజున కూడా మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం తప్పనిసరి. అంటే 8 రోజుల వ్యవధిలో రెండుసార్లు టెస్ట్ చేయించుకోవాల్సిందేనని కమిటీ తమ కొత్త నిబంధనల్లో సూచించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?