కోవిడ్ 19: అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేకాలు జారీ
- November 04, 2020
అబుధాబి:అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. అబుధాబి మీదుగా యూఏఈకి చేరుకునే పౌరులు, ప్రవాసీయులతో పాటు అబుధాబి నివాసితులు సైతం కోవిడ్ టెస్ట్ చేయించుకున్న 48 గంటల్లో అబుధాబి చేరుకోవాలని అబుధాబి కోవిడ్ 19 అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. పీసీఆర్ టెస్ట్ చేయించుకోని వారు డీపీఐ లేసేర్ టెస్ట్ రిపోర్ట్ ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు..అబుధాబిలో నాలుగు రోజులు ఉండే వారు తప్పనిసరిగా నాలుగో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అబుధాబిలో అడుగుపెట్టిన రోజును తొలి రోజుగా పరిగణిస్తారు. అంటే ఆదివారం అబుధాబికి చేరుకుంటే బుధవారం రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎనిమిది రోజులకు మించి అబుధాబిలో ఉంటే 8వ రోజున కూడా మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం తప్పనిసరి. అంటే 8 రోజుల వ్యవధిలో రెండుసార్లు టెస్ట్ చేయించుకోవాల్సిందేనని కమిటీ తమ కొత్త నిబంధనల్లో సూచించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!