పీఎఫ్ ఖాతాదారులకు దీపావళి కానుక..
- November 05, 2020
భారత్: ఎంప్లాయాస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ సబ్స్ర్కైబర్లకు గుడ్ న్యూస్ అందించేందుకు రెడీ అవుతోంది. పండగ సీజన్లో పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ రేటు అందిస్తామని ఈపీఎఫ్వో గతంలోనే ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఒకే సారి కాకుండా రెండు విడతలుగా జమ చేయాలనుకుంటోంది ఈపీఎఫ్. అందులో భాగంగానే మొదటి విడత నగదును దీపావళి నాటికి వారి అకౌంట్లలో జమచేయనుంది. మిగిలిన మొత్తాన్ని డిసెంబర్ చివరి నాటికి పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. ఇక ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో చూసుకునేందుకు పీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్వో వెబ్సైట్కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత పాస్బుక్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే అకౌంట్లో డబ్బులు వచ్చాయో లేదో తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!







