పీఎఫ్ ఖాతాదారులకు దీపావళి కానుక..
- November 05, 2020
భారత్: ఎంప్లాయాస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ సబ్స్ర్కైబర్లకు గుడ్ న్యూస్ అందించేందుకు రెడీ అవుతోంది. పండగ సీజన్లో పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ రేటు అందిస్తామని ఈపీఎఫ్వో గతంలోనే ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఒకే సారి కాకుండా రెండు విడతలుగా జమ చేయాలనుకుంటోంది ఈపీఎఫ్. అందులో భాగంగానే మొదటి విడత నగదును దీపావళి నాటికి వారి అకౌంట్లలో జమచేయనుంది. మిగిలిన మొత్తాన్ని డిసెంబర్ చివరి నాటికి పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. ఇక ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో చూసుకునేందుకు పీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్వో వెబ్సైట్కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత పాస్బుక్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే అకౌంట్లో డబ్బులు వచ్చాయో లేదో తెలుస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









