ఖతార్‌లో ఒకే రోజు 201 కోవిడ్‌ రికవరీలు

- November 06, 2020 , by Maagulf
ఖతార్‌లో ఒకే రోజు 201 కోవిడ్‌ రికవరీలు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్‌ 6న 192 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా దేశంలో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 130,881. కొత్తగా నమోదైన 192 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 150 కమ్యూనిటీ కేసులు కాగా, 42 విదేశాల నుంచి వచ్చినవి. కాగా, కరోనాతో ఇప్పటిదాకా 232 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 1,007,050 కరోనా టెస్టులు జరిగాయి. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 133,811. ప్రస్తుతం 2,698 యాక్టివ్‌ కేసులున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com