బ్యాటరీ మార్చుతుండగా బోటులో అగ్ని ప్రమాదం
- November 10, 2020రస్ అల్ ఖైమా: ఇద్దరు భారతీయ ఫిషర్మెన్ తీవ్రంగా గాయపడిన ఘటన రస్ అల్ ఖైమాలోని గలెలియా పోర్ట్ వద్ద జరిగింది. ఫిషింగ్ బోటులో అగ్ని ప్రమాదం సంభవించడంతో అందులో వున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఫిషర్మెన్కి ఓ మోస్తరు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. హాస్పిటల్ డైరెక్టర్ అహ్మద్ అల్ మెహబూబి మాట్లాడుతూ, గాయాలతో ఆసుపత్రిలో చేరినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని అన్నారు. రస్ అల్ ఖైమా ఫిషర్మెన్ అసోసియేషన్ హెడ్ ఖలీఫా అల్ ముహైరి మాట్లాడుతూ, బ్యాటరీని మార్చే క్రమంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు చెప్పారని, ఈ మేరకు అసోసియేషన్కి సమాచారం ఇచ్చారని తెలిపారు. రెగ్యులర్ మెయిన్టెనెన్స్తో ఈ తరహా ప్రమాదాల్ని నివారించవచ్చునని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్