జెడ్డా సిమిటెరీ ఎటాక్‌లో గాయపడ్డవారిని ప్రిన్స్‌ మిషాల్‌ పరామర్శ

- November 12, 2020 , by Maagulf
జెడ్డా సిమిటెరీ ఎటాక్‌లో గాయపడ్డవారిని ప్రిన్స్‌ మిషాల్‌ పరామర్శ

జెడ్డా‌: జెడ్డా గవర్నర్‌ ప్రిన్స్‌ మిషాల్‌ బిన్‌ మాజెద్‌, జెడ్డా సిమిటరీ ఎటాక్‌లో గాయపడ్డవారిని పరామర్శించారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న ప్రిన్స్‌ మిషాల్‌, వైద్య చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మక్కా రీజియన్‌ పోలీస్‌ డైరెక్టర్‌ మేజర్‌ జనరల్‌ ఈద్‌ అల్‌ ఒతైబి, పలు గవర్నరేట్లకు చెందిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్డాలోని ఓ నాన్‌ ముస్లిం సిమిటరీలో బాంబు పేలుడు సంభవించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులకు నివాళులర్పించేందుకు పలు విదేశీ ఎంబసీలు చేపట్టిన కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అందులో ఒకరు గ్రీక్‌ కాన్సులేట్‌ మెంబర్‌ కాగా, మరొకరు సౌదీ సెక్యూరిటీ గార్డ్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com