మొక్కజొన్న పాయసం
- February 17, 2016
కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు - అరకప్పు పనీర్ (చిన్నముక్కలు) - అరకప్పు పాలు - అరలీటరు, పాలపొడి - 6 టేబుల్ స్పూన్లు, పిస్తా
పలుకులు-8, బాదం పలుకులు -10, రోజ్వాటర్ - టీ స్పూను, యాలకుల పొడి - అరస్పూను, పంచదార - టేబుల్స్పూను, కుంకుమపువ్వు - కొద్దిగా.
తయారుచేసే విధానం
ముందుగా కుంకుమపూవుని రోజ్వాటర్లో, పిస్తా, బాదం పప్పుల్ని వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి ఉంచాలి. పిస్తా బాదంలను నీటిలోంచి తీసి సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలను కాగబెట్టి, అందులో మొక్కజొన్న గింజల్ని, పనీరు ముక్కల్ని వేసి, చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించి ఆపై పాలపొడిని వేస్తూ ఉండలు చుట్టకుండా కలపాలి. పాలు చిక్కబడ్డాక పంచదారను వేసి, అది కరుగుతున్నపడు కుంకుమపూవును కూడా వేసి దించాలి. తరిగి ఉంచుకున్న బాదం, పిస్తా ముక్కల్ని, యాలకుల పొడిని పైన చల్లాలి. పాయసం గది ఉష్ణోగ్రతలోకి వచ్చేక ఫ్రిజ్లో ఉంచి చల్లచల్లగా తాగితే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







