విజయవాడ లో "బ్రహ్మోత్సవం"
- May 27, 2015
ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీ మంతుడు' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. జూన్ చివరి వారంలోపు ఈ సినిమాని పూర్తి చేసి జూలై 17న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే... మహేష్ తన తదుపరి చిత్రం శ్రీ కాంత్ అడ్డాలతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'బ్రహ్మోత్సవం' అనే టైటిల్ ఖరారు చేస్తూ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న చిత్ర ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రోడక్షన్ పనులు చేస్తున్న దర్శకుడు శ్రీకాత్ అడ్డాల ఈ చిత్ర కథకు విజయవాడ బ్యాక్ డ్రాప్ని ఎంచుకున్నాడట. దాంతో 'బ్రహ్మోత్సవం' సినిమా చాలా భాగం షూటింగ్ విజయవాడలోనే ఉంటుందని సమాచారం. దానికోసం ఈ చిత్ర దర్శకుడితో పాటు కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి విజయవాడ వెళ్లి లోకేషన్లను పరిశీలించారట. వాటిలో ప్రకాశంబ్యారేజ్, కనకదుర్గమ్మ గుడి, బెంజ్ సర్కిల్ వంటి ప్రదేశాలను ఎంచుకున్నారని తెలుస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కోసం భద్రాచలం రామాలయంలో, 'ముకుంద' సినిమా కోసం ద్రాక్షారామం గుడిలో కొన్ని ముఖ్యసన్నివేశాలు షూట్ చేసిన శ్రీకాంత్ ఈసారి 'బ్రహ్మోత్సవం' కోసం విజయవాడ 'దుర్గగుడి'లో షూట్ చేయస్తాడనమాట. పివిపి బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ సరసన ముగ్గురు భామలు నటిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







