అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ..సౌదీ అరేబియా ప్రకటన
- November 24, 2020
రియాద్:కింగ్డమ్ పరిధిలోని దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించనున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్య సంక్షరణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా చేస్తోందని, ప్రజలకు వ్యాక్సిన్ ను అందించటాన్ని వ్యాపారంగా తాము భావించటం లేదని సౌదీ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్ అసిరి వెల్లడించారు. వచ్చే ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 70 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించగలమని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే..వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ప్రధాన్యత క్రమంలో ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 16 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ అందించకపోవటమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలిపారు. జీ20 సభ్య దేశాల్లో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి సమర్ధవంతమైన చర్యల్లో సౌదీ అరేబియా ఒకటని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









