మాస్క్లు ధరించని 58 మంది గుర్తింపు
- November 25, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ 58 మంది వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించడం జరిగింది. వీరంతా మాస్క్లు ధరించకుండా తిరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో మాస్క్లు ధరించడం తప్పనిసరి. అయితే, ఈ నిబంధనల్ని పలువురు ఉల్లంఘిస్తున్నారు. అలాంటివారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఓ వాహనంలో కరోనా నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్న ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఒకే ఫ్యామిలీకి చెందనివారు గరిష్టంగా నలుగురు (డ్రైవర్తో కలిసి) మాత్రమే కారులో ప్రయాణించాల్సి వుంటుందనే నిబంధన వుంది. కాగా, ఇప్పటిదాకా 1,670 మంది మాస్క్లు ధరించని కారణంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయబడ్డారు. వాహనాల్లో ప్రయాణానికి సంబంధించి 103 మంది ఉల్లంఘనలకు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







