మాస్క్లు ధరించని 58 మంది గుర్తింపు
- November 25, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ 58 మంది వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించడం జరిగింది. వీరంతా మాస్క్లు ధరించకుండా తిరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో మాస్క్లు ధరించడం తప్పనిసరి. అయితే, ఈ నిబంధనల్ని పలువురు ఉల్లంఘిస్తున్నారు. అలాంటివారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఓ వాహనంలో కరోనా నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్న ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఒకే ఫ్యామిలీకి చెందనివారు గరిష్టంగా నలుగురు (డ్రైవర్తో కలిసి) మాత్రమే కారులో ప్రయాణించాల్సి వుంటుందనే నిబంధన వుంది. కాగా, ఇప్పటిదాకా 1,670 మంది మాస్క్లు ధరించని కారణంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయబడ్డారు. వాహనాల్లో ప్రయాణానికి సంబంధించి 103 మంది ఉల్లంఘనలకు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
- టీవీకే ఆధిక్యం..విజయ్ ఇంట్లో మిన్నంటిన సంబరాలు!
- ఐపీఎల్ 2026..టాప్ 4 జట్లకు గట్టి పోటీ!
- టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!









