మాస్క్‌లు ధరించని 58 మంది గుర్తింపు

- November 25, 2020 , by Maagulf
మాస్క్‌లు ధరించని 58 మంది గుర్తింపు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ 58 మంది వ్యక్తుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగింది. వీరంతా మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. అయితే, ఈ నిబంధనల్ని పలువురు ఉల్లంఘిస్తున్నారు. అలాంటివారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఓ వాహనంలో కరోనా నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్న ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఒకే ఫ్యామిలీకి చెందనివారు గరిష్టంగా నలుగురు (డ్రైవర్‌తో కలిసి) మాత్రమే కారులో ప్రయాణించాల్సి వుంటుందనే నిబంధన వుంది. కాగా, ఇప్పటిదాకా 1,670 మంది మాస్క్‌లు ధరించని కారణంగా పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేయబడ్డారు. వాహనాల్లో ప్రయాణానికి సంబంధించి 103 మంది ఉల్లంఘనలకు పాల్పడ్డారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com