భారత్ లో 94 లక్షలకు చేరువలో కరోనా కేసులు...
- November 29, 2020
న్యూఢిల్లీ : భారత దేశంలో కరోనా కేసులు 94 లక్షల చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,810 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తంగా వైరస్ కేసులు 93,92,919కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 496 మందిని కరోనా బలితీసుకుంది. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 1, 36, 696కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. 42,298 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 88,02,267 మంది ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం 4,53,956 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 13,95,03,803 మందికి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 6,250 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 5,900 కేసులు నమోదు కాగా...ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది కరోనా బారిన పడ్డారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







