భారత్ లో 94 లక్షలకు చేరువలో కరోనా కేసులు...
- November 29, 2020న్యూఢిల్లీ : భారత దేశంలో కరోనా కేసులు 94 లక్షల చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,810 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తంగా వైరస్ కేసులు 93,92,919కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 496 మందిని కరోనా బలితీసుకుంది. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 1, 36, 696కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. 42,298 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 88,02,267 మంది ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం 4,53,956 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 13,95,03,803 మందికి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 6,250 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 5,900 కేసులు నమోదు కాగా...ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది కరోనా బారిన పడ్డారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన