భారత్ లో 94 లక్షలకు చేరువలో కరోనా కేసులు...
- November 29, 2020
న్యూఢిల్లీ : భారత దేశంలో కరోనా కేసులు 94 లక్షల చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,810 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తంగా వైరస్ కేసులు 93,92,919కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 496 మందిని కరోనా బలితీసుకుంది. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 1, 36, 696కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. 42,298 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 88,02,267 మంది ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం 4,53,956 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 13,95,03,803 మందికి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 6,250 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 5,900 కేసులు నమోదు కాగా...ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది కరోనా బారిన పడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







