అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం
- November 29, 2020
మనామా:క్యాపిటల్ మునిసిపాలిటీ, వీధి వ్యాపారులకు సంబంధించి 1,932 ఉల్లంఘనల్ని గుర్తించి తొలగించడం జరిగింది గడచిన తొమ్మిది నెలల్లో. మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా వీధుల్లో అక్రమ వ్యాపారుల కారణంగా అందమైన, పరిశుశ్రమైన అప్పీయరెన్స్ దెబ్బతింటోందనీ, ఈ కారణంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్ వర్క్స్ యాక్ట్ ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేయడంతోపాటుగా, ఆక్రమణల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. గత శుక్రవారం 20 మాట్రెసెస్ని మనామా సెంటర్లోని కాంప్లెక్స్ 304 నుంచి తొలగించడం జరిగింది. మూడో త్రైమాసికంలో అక్రమ వీధి వ్యాపారుల తొలగింపు 633కి చేరుకుంది. మొత్తంగా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ తొలగింపుల సంఖ్య 1,924కి చేరింది. ఈ తరహా అక్రమ వ్యాపారుల్ని ప్రోత్సహించరాదని పౌరులు అలాగే నివాసితులకు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







