అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం
- November 29, 2020
మనామా:క్యాపిటల్ మునిసిపాలిటీ, వీధి వ్యాపారులకు సంబంధించి 1,932 ఉల్లంఘనల్ని గుర్తించి తొలగించడం జరిగింది గడచిన తొమ్మిది నెలల్లో. మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా వీధుల్లో అక్రమ వ్యాపారుల కారణంగా అందమైన, పరిశుశ్రమైన అప్పీయరెన్స్ దెబ్బతింటోందనీ, ఈ కారణంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్ వర్క్స్ యాక్ట్ ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేయడంతోపాటుగా, ఆక్రమణల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. గత శుక్రవారం 20 మాట్రెసెస్ని మనామా సెంటర్లోని కాంప్లెక్స్ 304 నుంచి తొలగించడం జరిగింది. మూడో త్రైమాసికంలో అక్రమ వీధి వ్యాపారుల తొలగింపు 633కి చేరుకుంది. మొత్తంగా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ తొలగింపుల సంఖ్య 1,924కి చేరింది. ఈ తరహా అక్రమ వ్యాపారుల్ని ప్రోత్సహించరాదని పౌరులు అలాగే నివాసితులకు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







