అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం
- November 29, 2020
మనామా:క్యాపిటల్ మునిసిపాలిటీ, వీధి వ్యాపారులకు సంబంధించి 1,932 ఉల్లంఘనల్ని గుర్తించి తొలగించడం జరిగింది గడచిన తొమ్మిది నెలల్లో. మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా వీధుల్లో అక్రమ వ్యాపారుల కారణంగా అందమైన, పరిశుశ్రమైన అప్పీయరెన్స్ దెబ్బతింటోందనీ, ఈ కారణంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్ వర్క్స్ యాక్ట్ ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేయడంతోపాటుగా, ఆక్రమణల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. గత శుక్రవారం 20 మాట్రెసెస్ని మనామా సెంటర్లోని కాంప్లెక్స్ 304 నుంచి తొలగించడం జరిగింది. మూడో త్రైమాసికంలో అక్రమ వీధి వ్యాపారుల తొలగింపు 633కి చేరుకుంది. మొత్తంగా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ తొలగింపుల సంఖ్య 1,924కి చేరింది. ఈ తరహా అక్రమ వ్యాపారుల్ని ప్రోత్సహించరాదని పౌరులు అలాగే నివాసితులకు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







