అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం
- November 29, 2020
మనామా:క్యాపిటల్ మునిసిపాలిటీ, వీధి వ్యాపారులకు సంబంధించి 1,932 ఉల్లంఘనల్ని గుర్తించి తొలగించడం జరిగింది గడచిన తొమ్మిది నెలల్లో. మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా వీధుల్లో అక్రమ వ్యాపారుల కారణంగా అందమైన, పరిశుశ్రమైన అప్పీయరెన్స్ దెబ్బతింటోందనీ, ఈ కారణంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్ వర్క్స్ యాక్ట్ ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేయడంతోపాటుగా, ఆక్రమణల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. గత శుక్రవారం 20 మాట్రెసెస్ని మనామా సెంటర్లోని కాంప్లెక్స్ 304 నుంచి తొలగించడం జరిగింది. మూడో త్రైమాసికంలో అక్రమ వీధి వ్యాపారుల తొలగింపు 633కి చేరుకుంది. మొత్తంగా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ తొలగింపుల సంఖ్య 1,924కి చేరింది. ఈ తరహా అక్రమ వ్యాపారుల్ని ప్రోత్సహించరాదని పౌరులు అలాగే నివాసితులకు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!









