ఎగ్జిట్‌ పర్మిట్‌ డిస్ప్యూట్స్‌ కమిటీకి క్యాబినెట్‌ ఆమోదం

- February 18, 2016 , by Maagulf
ఎగ్జిట్‌ పర్మిట్‌ డిస్ప్యూట్స్‌ కమిటీకి క్యాబినెట్‌ ఆమోదం

వలసదారుల ఎంట్రీ, ఎగ్జిట్‌ మరియు రెసిడెన్సీ పర్మిట్స్‌కి సంబంధించి స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఖతార్‌ స్టేట్‌ క్యాబినెట్‌ డ్రాఫ్ట్‌ని అప్రూవ్‌ చేసింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ మేరకు ప్రతిపాదన చేసింది. వలసదారుల ఎగ్జిట్‌ పర్మిట్స్‌కి సంబంధించి స్పెషల్‌ కమిటీ ఇకపై అన్ని అంశాలనూ పరిశీలిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ప్రతినిథి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే మరో ఇద్దరు అథికారులు ఇందులో ఉంటారు. కొత్త చట్టం ప్రకారం ఎగ్జిట్‌ పర్మిట్‌ కోసం స్పాన్సర్‌ లేదా యజమాని పర్మిషన్‌ అవసరంలేదు. యజమానికి మూడు రోజుల ముందుగా సమాచారం ఇచ్చి, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ని సంప్రదిస్తే సరిపోతుంది. ఒకవేళ యజమాని నుంచి అభ్యంతరం వస్తే, ఇరు వర్గాలూ గ్రీవెన్సెస్‌ కమిటీ ముందు హాజరవుతారు. అత్యవసర సందర్భాల్లో యజమానికి సమాచారం ఇచ్చి, సంబంధిత అథారిటీ ఆమోదంతో ఎగ్జిట్‌ పర్మిట్‌ పొందవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com