యుఏఈ జైళ్ళకే ఇండియన్‌ ప్రిజనర్స్‌ మొగ్గు

- February 18, 2016 , by Maagulf
యుఏఈ జైళ్ళకే ఇండియన్‌ ప్రిజనర్స్‌ మొగ్గు

యుఏఈ జైళ్ళలో ఉండేందుకే ఇండియన్‌ ప్రిజనర్స్‌ మొగ్గు చూపుతున్నట్లు యుఏఈలోని ఇండియా రాయబారి టి.పి. సీతారామ్‌ చెప్పారు. ఇది అంగీకరించవలసిన వాస్తవని ఆయన అన్నారు. 1200 మందిలో కేవలం 10 శాతం మంది మాత్రమే యూఏఈ నుంచి ఇండియా జైళ్ళకు వెళ్ళేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నట్లు చెప్పారాయన. ఐదుగురి పేర్లను యూఏఈ అథారిటీస్‌ నుంచి అందుకున్నామనీ, తరలింపు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందనీ, అయితే అది ఎప్పుడన్నది ఖచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. ట్రాన్స్‌ఫర్‌ని కోరుకుంటున్న ఖైదీలు, యూఏఈలో మినిమమ్‌ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి ఉండాలి. అలాగే వారిపై ఎలాంటి అదనపు కేసులూ ఉండకూడదు. ఇరు దేశాల మధ్య ఒప్పందం మేరకు ఎక్కడికి తరలించాల్సి వస్తుందో ఆ దేశం ఖైదీల ప్రయాణ ఖర్చుల్ని భరించాలి. అయితే యూఏఈ జైళ్ళలోనే ఉండేందుకు ఖైదీలు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఇండియాతో పోల్చితే యూఏఈ జైళ్ళలో సౌకర్యాలు బాగుండడమేనట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com