యుఏఈ జైళ్ళకే ఇండియన్ ప్రిజనర్స్ మొగ్గు
- February 18, 2016
యుఏఈ జైళ్ళలో ఉండేందుకే ఇండియన్ ప్రిజనర్స్ మొగ్గు చూపుతున్నట్లు యుఏఈలోని ఇండియా రాయబారి టి.పి. సీతారామ్ చెప్పారు. ఇది అంగీకరించవలసిన వాస్తవని ఆయన అన్నారు. 1200 మందిలో కేవలం 10 శాతం మంది మాత్రమే యూఏఈ నుంచి ఇండియా జైళ్ళకు వెళ్ళేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నట్లు చెప్పారాయన. ఐదుగురి పేర్లను యూఏఈ అథారిటీస్ నుంచి అందుకున్నామనీ, తరలింపు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందనీ, అయితే అది ఎప్పుడన్నది ఖచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. ట్రాన్స్ఫర్ని కోరుకుంటున్న ఖైదీలు, యూఏఈలో మినిమమ్ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి ఉండాలి. అలాగే వారిపై ఎలాంటి అదనపు కేసులూ ఉండకూడదు. ఇరు దేశాల మధ్య ఒప్పందం మేరకు ఎక్కడికి తరలించాల్సి వస్తుందో ఆ దేశం ఖైదీల ప్రయాణ ఖర్చుల్ని భరించాలి. అయితే యూఏఈ జైళ్ళలోనే ఉండేందుకు ఖైదీలు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఇండియాతో పోల్చితే యూఏఈ జైళ్ళలో సౌకర్యాలు బాగుండడమేనట.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









