యుఏఈ జైళ్ళకే ఇండియన్ ప్రిజనర్స్ మొగ్గు
- February 18, 2016
యుఏఈ జైళ్ళలో ఉండేందుకే ఇండియన్ ప్రిజనర్స్ మొగ్గు చూపుతున్నట్లు యుఏఈలోని ఇండియా రాయబారి టి.పి. సీతారామ్ చెప్పారు. ఇది అంగీకరించవలసిన వాస్తవని ఆయన అన్నారు. 1200 మందిలో కేవలం 10 శాతం మంది మాత్రమే యూఏఈ నుంచి ఇండియా జైళ్ళకు వెళ్ళేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నట్లు చెప్పారాయన. ఐదుగురి పేర్లను యూఏఈ అథారిటీస్ నుంచి అందుకున్నామనీ, తరలింపు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందనీ, అయితే అది ఎప్పుడన్నది ఖచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. ట్రాన్స్ఫర్ని కోరుకుంటున్న ఖైదీలు, యూఏఈలో మినిమమ్ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి ఉండాలి. అలాగే వారిపై ఎలాంటి అదనపు కేసులూ ఉండకూడదు. ఇరు దేశాల మధ్య ఒప్పందం మేరకు ఎక్కడికి తరలించాల్సి వస్తుందో ఆ దేశం ఖైదీల ప్రయాణ ఖర్చుల్ని భరించాలి. అయితే యూఏఈ జైళ్ళలోనే ఉండేందుకు ఖైదీలు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఇండియాతో పోల్చితే యూఏఈ జైళ్ళలో సౌకర్యాలు బాగుండడమేనట.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







