చైనా ఎత్తుగడ.. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు!
- November 30, 2020బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్ను నిర్మించే ఆలోచనలో ఉన్నది. టిబెట్లో ఆ హైడ్రోపవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను చైనా తన 14వ పంచవర్ష ప్రణాళికలో కేటాయించించింది. డ్యామ్ నిర్మాణానికి చైనా కంపెనీకి కూడా బాధ్యతలు అప్పగించినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ యాన్ జియాంగ్ ఈ అంశంపై మాట్లాడారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో యార్లంగ్ జాంగ్బో నదిగా పిలుస్తారు. అయితే ఆ నదిపై హైడ్రోపవర్ డ్యామ్ను కట్టనున్నట్లు యాన్ జియాంగ్ తెలిపారు. జలవనరులు, స్వదేశీ భద్రత అంశాలను కూడా ఆ డ్యామ్తో పరిశీలించనున్నట్లు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది. చరిత్రలో ఇటువంటి సందర్భం ఏదీ లేదని, చైనా హైడ్రోపవర్ పరిశ్రమకు ఇదో అద్భత అవకాశం అని యాన్ జియాంగ్ తెలిపారు. వచ్చే ఏడాది ఎన్పీసీ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను వెల్లడించనున్నారు.
బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ కట్టాలనుకుంటున్న చైనా ప్రతిపాదన పట్ల భారత్, బంగ్లాదేశ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ చైనా మాత్రం అటువంటి సమస్య ఏదీ ఉండదని పేర్కొన్నది. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని డ్యామ్ కట్టేందుకు పూనుకున్నట్లు చైనా చెప్పింది. దిగువ దేశాల ప్రయోజనాల గురించి ఆలోచించాలని పలుమార్లు చైనాకు భారత్ అభ్యర్థన చేసింది. ఇప్పటికే టిబెట్లో 2015లో జామ్ హైడ్రోపవర్ స్టేషన్ను సుమారు 1.5 బిలియన్ల డాలర్ల ఖర్చుతో చైనా నిర్మించింది. అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దుల్లో ఉన్న టిబెట్లోని మిడాంగ్ జిల్లాలో కొత్త డ్యామ్ను చైనా నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం