కరోనావైరస్ వ్యాక్సీన్ అధ్యయనం కోసం హైదరాబాద్ చేరుకున్న 64 దేశాల రాయబారులు
- December 09, 2020



కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను సందర్శించటానికి భారతదేశంలోని 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు బుధవారం హైదరాబాద్ వచ్చారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధి గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయటం కోసం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటనను ఏర్పాటు చేసింది.
దిల్లీ కేంద్రంగా పనిచేసే విదేశాల రాయబారులు, దౌత్యాధికారుల బృందం ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ సంస్థలను సందర్శిస్తుంది.
ఈ సందర్భంగా దేశంలో కరోనా వ్యాక్సీన్ల తయారీ, పురోగతి గురించి విదేశీ ప్రతినిధులు తెలుసుకుంటారు. టీకాల అభివృద్ధిపై ప్రదర్శనను తిలకిస్తారు. అనంతరం శాస్త్రవేత్తలతో భేటీ అవుతారు.
వీరు రెండు బృందాలుగా విడిపోతారు. ఒక బృందం భారత్ బయోటెక్ను, మరొక బృందం బయోలాజికల్-ఇని సందర్శిస్తుంది. కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం తిరిగి బయల్దేరి వెళతారు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









