ఉత్తమ పనితీరుకు ప్రశంసాపత్రం

- December 23, 2020 , by Maagulf
ఉత్తమ పనితీరుకు ప్రశంసాపత్రం

హైదరాబాద్:సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్, ఆర్ఐ సురేశ్  ఎన్నికల బందోబస్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బంది పేర్లను సైబరాబాద్ సీపీ  వీసీ సజ్జనార్ డిజి ఆఫీసుకు పంపించగా సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్,ఆర్ఐ సురేశ్  పేర్లను ఆమోదించారు. 

ఈ మేరకు ఎన్నికల విధులలో క్రమశిక్షణ, నిబద్ధత, ఉత్తమ పనితీరును కనబర్చిన పోలీస్ సిబ్బంది సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి మాణిక్ రాజ్, ఆర్ఐ సురేశ్  కు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సంతకం చేసిన ప్రశంసా పత్రాలను ఈరోజు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అందజేశారు. 


2018 తెలంగాణ శాసన సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలను సమన్వయపరిచి, సహకరించిన పోలీసులకు ముఖ్యంగా ఈ అవార్డులను అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com