తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..
- December 30, 2020హైదరాబాద్:తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక పక్క స్ట్రెయిన్ గుబులు పుట్టిస్తున్న తరుణంలో కరోనా కేసులు పెరగడం కూడా టెన్షన్ పెడుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 474 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ముగ్గురు మృతి చెందారు.. ఇదే సమయంలో 592 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,85,939కు పెరగగా.. ఇప్పటి వరకు 1538 మంది కరోనాతో మృతి చెందారు.. 2,78,523 మంది రికవరీ అయ్యారు.. ఇక, కరోనా మరణాలు దేశంలో 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయిన.. రికవరీ రేటు దేశంలో 97.40 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 96 శాతానికి పెరిగిందని బులెటిన్ లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 5,878 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 3,735 హోం ఐసోలేషన్లోనే ఉన్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,590 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... టెస్ట్ల సంఖ్య 68,39,281కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు