బ్రిటన్:ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా

- January 06, 2021 , by Maagulf
బ్రిటన్:ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా

లండన్:బ్రిటన్ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.  పోసిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతున్నది.  పాత వైరస్ తో పాటుగా బ్రిటన్ లో కొత్త స్ట్రైన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  రోజుకు 50 నుంచి 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం లాక్ డౌన్ ను విధించారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.  ఇక ఇదిలా ఉంటె,బ్రిటన్ లో కరోనా కేసుల వివరాలపై ఓ సర్వేను నిర్వహించారు.  ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.  దేశంలో ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది.  అలానే, లండన్ లో ప్రతి 30 మందిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు సర్వేలో నిర్ధారణ జరిగింది. వైరస్ బారిన పడినప్పటికీ లక్షణాలు లేని వ్యక్తులను గురించే క్రమంలో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com