ఇద్దరు మైనర్ల డిటెన్షన్ పొడిగింపు
- January 07, 2021
కువైట్ సిటీ:ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంప్రదింపులు జరుపుతున్న నేరానికిగాను ఇద్దరు మైనర్లను డిటెన్షన్ చేశారు. దీన్ని పొడిగిస్తూ, న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నిందితుల వద్ద ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కేసు విచారణను జువైనైల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్కి అప్పగించడం జరిగింది. ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ పబ్జీ ద్వారా ఈ సంప్రదింపులు జరిగినట్లు విచారణలో తేలింది. ఆట సందర్భంగా, ఉద్దేశపూర్వకంగానే నిందితులు, తీవ్రవాద సంస్థతో చేరినట్లు నిర్ధారించారు. పలు దఫాలుగా ఐపిస్తో సంప్రదింపులు జరిగాయనీ, ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో సహకరించాలంటూ శిక్షణ కూడా ఇచ్చారని విచారణలో తేలింది. తొలుత ఓ మైనర్ ఈ ట్రాప్లో పడగా, ఆ తర్వాత ఆ మైనర్, తన స్నేహితుడ్ని కూడా ఇందులోకి లాగినట్లు విచారణలో అధికారులు గుర్తించి, ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







