ఇద్దరు మైనర్ల డిటెన్షన్ పొడిగింపు
- January 07, 2021
కువైట్ సిటీ:ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంప్రదింపులు జరుపుతున్న నేరానికిగాను ఇద్దరు మైనర్లను డిటెన్షన్ చేశారు. దీన్ని పొడిగిస్తూ, న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నిందితుల వద్ద ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కేసు విచారణను జువైనైల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్కి అప్పగించడం జరిగింది. ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ పబ్జీ ద్వారా ఈ సంప్రదింపులు జరిగినట్లు విచారణలో తేలింది. ఆట సందర్భంగా, ఉద్దేశపూర్వకంగానే నిందితులు, తీవ్రవాద సంస్థతో చేరినట్లు నిర్ధారించారు. పలు దఫాలుగా ఐపిస్తో సంప్రదింపులు జరిగాయనీ, ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో సహకరించాలంటూ శిక్షణ కూడా ఇచ్చారని విచారణలో తేలింది. తొలుత ఓ మైనర్ ఈ ట్రాప్లో పడగా, ఆ తర్వాత ఆ మైనర్, తన స్నేహితుడ్ని కూడా ఇందులోకి లాగినట్లు విచారణలో అధికారులు గుర్తించి, ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







