ఇద్దరు మైనర్ల డిటెన్షన్ పొడిగింపు

- January 07, 2021 , by Maagulf
ఇద్దరు మైనర్ల డిటెన్షన్ పొడిగింపు

కువైట్ సిటీ:ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంప్రదింపులు జరుపుతున్న నేరానికిగాను ఇద్దరు మైనర్లను డిటెన్షన్ చేశారు. దీన్ని పొడిగిస్తూ, న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నిందితుల వద్ద ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కేసు విచారణను జువైనైల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్‌కి అప్పగించడం జరిగింది. ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ పబ్జీ ద్వారా ఈ సంప్రదింపులు జరిగినట్లు విచారణలో తేలింది. ఆట సందర్భంగా, ఉద్దేశపూర్వకంగానే నిందితులు, తీవ్రవాద సంస్థతో చేరినట్లు  నిర్ధారించారు. పలు దఫాలుగా ఐపిస్‌తో సంప్రదింపులు జరిగాయనీ, ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో సహకరించాలంటూ శిక్షణ కూడా ఇచ్చారని విచారణలో తేలింది. తొలుత ఓ మైనర్ ఈ ట్రాప్‌లో పడగా, ఆ తర్వాత ఆ మైనర్, తన స్నేహితుడ్ని కూడా ఇందులోకి లాగినట్లు విచారణలో అధికారులు గుర్తించి, ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com