శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ గోల్డ్ బార్స్ స్వాధినం..

- January 07, 2021 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ గోల్డ్ బార్స్ స్వాధినం..

హైదరాబాద్:మరోసారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‏కు ఫ్లైట్ నంబర్ IX1948 ద్వారా వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి గోల్డ్ బార్స్‏ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అతని దగ్గర విదేశీ సిగరెట్లను కూడా గుర్తించారు. ఆ బంగారు బిస్కెట్ల బరువు 349.800 గ్రాములు ఉంది. వాటి విలువ రూ.18.36 లక్షలు. సిగరెట్లు రూ.1,20,000 విలువైనవి స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com