వాయిస్ మెసేజ్తో పార్కింగ్ రుసుము
- February 22, 2016
అజ్మన్ మునిసిపాలిటీ పెయిడ్ పార్కింగ్ కోసం న్యూ యాప్ని ప్రారంభించింది. పార్కింగ్ టిక్కెట్ని వాయిస్ మెసేజ్ ద్వారా చెల్లించే విధానాన్ని ఈ యాప్ ద్వారా ప్రవేశపెట్టారు. అజ్మన్ మున్సిపాలిటీ మరియు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో స్మార్ట్ సర్వీసెస్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్ యూసఫ్ అల్ షైబా మాట్లాడుతూ 'మావ్ఖిఫి' పేరుతో రూపొందించిన ఈ యాప్, రీజియన్లో మొట్టమొదటిదని అన్నారు. పెయిడ్ పార్కింగ్ కోసం సమీపంలోని మెషీన్స్ వద్దకు వెళ్ళాల్సిన పనిలేకుండా, తమ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకున్న యాప్ని వినియోగించుకుని కేవలం వాయిస్ మెసేజ్తో పార్కింగ్ రుసుము చెల్లించవచ్చని ఆయన అన్నారు. అలాగే ఈ యాప్ ద్వారా అవసరమైనప్పుడు ముందుగానే వీఐపీ పార్కింగ్ని కూడా బుక్ చేసుకోవచ్చట. ఎక్కువ సమయం పార్కింగ్ చేసుకోవాలనుకునేవారికి 60 శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్లు అల్ షైబా చెప్పారు. సెంట్రల్ పార్కింగ్ సిస్టమ్, మునిసిపాలిటీ ఇన్స్పెక్టర్స్ వినియోగించే సిస్టమ్కీ ఈ యాప్ కనెక్ట్ అయి ఉంటుంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







