హోటల్స్, రెస్టారెంట్లలో అన్ని వేడుకలు, సంబరాలపై నిషేధం విధించిన బహ్రెయిన్
- January 12, 2021
మనామా:కోవిడ్ స్ట్రెయిన్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది బహ్రెయిన్. ఇక నుంచి కింగ్డమ్ పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్లు, లాంజ్, ఇన్ డోర్, ఔట్ డోర్ లలో ఎలాంటి వేడుకలకు అనుమతులు లేవని బహ్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ స్ట్రెయిన్ మరింత వేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయనే నిపుణుల హెచ్చరికలతో బహ్రెయిన్ ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఒకే చోట గుమికూడటం, పార్టీలు, సెలబ్రేషన్ల పేరుతో ఒకే చోట చేరి వేడుకలు నిర్వహించటం వంటి కార్యక్రమాలపై నిషేధం అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హోటల్స్, టూరిజం రంగంలోని సిబ్బంది ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









