ప్రధాన నగరాలకు ఫ్లైట్ సర్వీసులను పెంచిన ఒమన్ ఎయిర్
- January 12, 2021
మస్కట్:ఒమన్ ఎయిర్ ప్రపంచంలోని పలు ప్రధాన నగరాలకు తమ ఫ్లైట్ సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొన్నాళ్లుగా పరిమిత సంఖ్యలో సర్వీసులు నడిపిన ఒమన్ ఎయిర్ ఇప్పుడు వాటికి మరికొన్ని సర్వీసులను యాడ్ చేసింది. మస్కట్ నుంచి దోహాకు వారానికి 2 ఫ్లైట్స్ వెళ్తుండగా ఇప్పుడు వాటి సంఖ్యను 3కి పెంచింది. దుబాయ్ వెళ్లే ఫ్లైట్స్ ని 3 నుంచి 5కి, లండన్ ఫ్లైట్స్ ని 2 నుంచి 3కి పెంచింది. అలాగే మస్కట్ నుంచి హైదరాబాద్, ముంబై, కొచ్చి, ఢిల్లీ, చెన్నైతో పాటు ఖైరో, ఇస్లామాబాద్, లాహోర్ కు వెళ్లే ఫ్లైట్స్ సంఖ్యను కూడా పెంచుతున్నట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది. అయితే...ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు వివరించింది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, అలాగే ఫ్లైట్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు విధిగా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించింది. అలాగే ప్రయాణికులు దిగిన తర్వాత తగిన ప్రమాణాలతో విమానంలో డిసిన్ఫెక్షన్ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇక ఫ్లైట్ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లను ఇస్తున్నామని, ప్రయాణికుల అహార విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నామని తెలిపింది. ఒమన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తాము పాటించాల్సిన సూచనలు, జాగ్రత్తల కోసం http://omanair.com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలని ఒమన్ ఎయిర్ సూచించింది.
తాజా వార్తలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!









