పర్యాటకుడి దగ్గర 2కేజీల మత్తు పదార్ధాలు...దుబాయ్ ఎయిర్ పోర్టులో పట్టివేత

- January 15, 2021 , by Maagulf
పర్యాటకుడి దగ్గర 2కేజీల మత్తు పదార్ధాలు...దుబాయ్ ఎయిర్ పోర్టులో పట్టివేత

దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఓ విజిటర్ నిషేధిత మత్తు పదార్ధాలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడిన వ్యక్తి పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి అని ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 26 ఏళ్ల పాకిస్తానీ తనతో పాటు తెచ్చిన పండ్ల బాక్స్ లో మత్తుపదార్ధాలను దాచి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. పండ్ల బాక్సు సైడ్ వాల్స్ సాధారణంగా ఎక్కువ మందంగా ఉండటంతో తమకు అనుమానం వచ్చిందని వివరించారు. బాక్సును పరిశీలించటంతో నిషేధిత మత్తు పదార్ధాలు బయట పడ్డాయని తెలిపారు. చట్ట విరుద్ధమైన డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై నిందితుడ్ని అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ కు తరలించామని అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com