‘గెట్ టుగెదర్’ చేసుకున్న హాస్యనటులు..
- January 18, 2021హైదరాబాద్:తెలుగు సినిమాల్లోని యంగ్ కమెడియన్స్ అంతా ఒకే ఫ్రేమ్లో కనిపించారు. సినిమాల్లో వీరందరూ ఓకే సారి కనిపించారు. కానీ ఈసారి మాత్రం అంతా కలిసి గెట్ టుగెదర్ జరుపుకున్నారు. ఇందులో మొత్తం 11 మంది కమెడియన్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
గెట్ టుగెదర్ ఫోటోలను స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. “దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఫ్లయింగ్ కలర్స్ రీయూనియన్.. ఈ ఫోటో షేర్ చేయడానికి రెండు వారాలు పట్టింది”.. అంటూ రాసుకొచ్చాడు వెన్నెల కిషోర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన నెటిజన్లు రకారకాలు గా కామెంట్స్ చేస్తున్నారు. కమెడియన్లంతా ఒకే చోట చేరడం బాగుంది.. ఈ పదకొండు మంది కలిసి పరమానందయ్య శిష్యుల కథ సినిమాను మళ్ళీ తీస్తే చాలా బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..