మిడిల్ ఈస్ట్‌లో ఫోర్బ్స్ టాప్ ఇండియన్ బిజినెస్ లీడర్స్

- January 18, 2021 , by Maagulf
మిడిల్ ఈస్ట్‌లో ఫోర్బ్స్ టాప్ ఇండియన్ బిజినెస్ లీడర్స్

మిడిల్ ఈస్ట్‌:ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్, టాప్ ఇండియన్ లీడర్స్ వివరాల్ని వెల్లడించింది. 30 మందితో కూడిన లిస్టులో అత్యధికం యూఏఈకి చెందినవారు కావడం గమనార్హం. లులు గ్రూపు ఛైర్మన్ యూసుఫ్ అలి ఎంఎ మొదటి స్థానంద క్కించుకోగా, ల్యాండ్ మార్కు గ్రూపుకి చెందిన రేణుకా జగిత్యాని తర్వాతి స్థానం దక్కించుకున్నారు. జెమ్స్ ఎడ్యుకేషన్ సన్నీ వార్కీ, సుని వస్వాని, రవి పిళ్ళయ్, పిఎన్‌సి మీనన్, డాక్టర్ షంషేర్ వయాలి తదితరులు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. వెటరన్ బిజినెస్ లీడర్ల డామినేషన్ వున్నప్పటికీ, న్యూ జనరేషన్ బిజినెస్ ఓనర్లయిన అదీబ్ అహ్మద్ తదితరులకూ ప్రత్యేమైన గుర్తింపు లభించింది. రిటెయిల్, బిజినెస్ లీడర్లు, ఇండస్ట్రియల్, హెల్త్ కేర్ విభాగం అలాగే ఫైనాన్స్ రంగాలకు చెందినవారు స్థానం దక్కించుకున్నారు ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్‌ టాప్ ఇండియన్స్ లిస్టులో.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com