టీమిండియాకు 5 కోట్ల బోనస్
- January 19, 2021ముంబై: టీమిండియా క్రికెటర్లపై కనక వర్షం కురిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియా ఆటగాళ్లకు రూ.5 కోట్ల టీమ్ బోనస్ను ప్రకటించింది బీసీసీఐ. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాలు కూడా ఈ విషయాన్ని తెలిపారు. గబ్బా టెస్టులో 3 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. అసాధారణ రీతిలో సిరీస్ను గెలిచిన భారత క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
"The BCCI has announced INR 5 Crore as team bonus"- BCCI Secretary Mr @JayShah tweets.#TeamIndia pic.twitter.com/vgntQuyu8V
— BCCI (@BCCI) January 19, 2021
ఇదో అద్భుత విజయం అని, ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ టెస్ట్ సిరీస్ను గెలవడం అపూర్వమని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ విజయం ఎన్నటికీ మరిచిపోనిదన్నారు. సిరీస్లో పాల్గొన్న భారత జట్టుకు 5 కోట్ల బోనస్ ప్రకటిస్తున్నట్లు తన ట్వీట్లో గంగూలీ తెలిపారు. ఈ గెలుపు విలువకు ఏదీ సమానం కాదన్నారు. టూర్లో పాల్గొన్న ప్రతి ఆటగాడిని గంగూలీ మెచ్చుకున్నారు. ఆటగాళ్లకు టీమ్ బోనస్గా 5 కోట్లు ప్రకటించామని, భారత క్రికెట్కు ఇవి ప్రత్యేకమైన క్షణాలని, అద్భుత నైపుణ్యాన్ని, ప్రతిభను భారత జట్టు ప్రదర్శించిన కార్యదర్శి జే షా తన ట్వీట్లో తెలిపారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!