వ్యాక్సినేషన్ తేదీలను రీషెడ్యూల్ చేయనున్న కువైట్
- January 21, 2021కువైట్ సిటీ:కువైట్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. సరిపోయినంతగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవటంతో వైరస్ వ్యాక్సిన్ అపాయింట్మెంట్ తేదీలను రీషెడ్యూల్ చేయనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిజానికి ఫైజర్-బయోన్టెక్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తొలి విడత డోసులకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది కువైట్. అయితే..ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ఫైజర్ కంపెనీకి కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు రావటం...డిమాండ్ కు తగినట్లు ప్లాంట్ లో ఉత్పత్తి లేకపోవటంతో ఒప్పందం మేరకు అందివాల్సిన డోసులు ఇంకా కువైట్ కు చేరుకోలేదు. త్వరలోనే సెకండ్ బ్యాచ్ వస్తుందని కువైట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఫైజర్ నుంచి తమకు ఉన్న సమాచారం మేరకు వైరస్ వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది కువైట్.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?