వ్యాక్సినేషన్ తేదీలను రీషెడ్యూల్ చేయనున్న కువైట్
- January 21, 2021కువైట్ సిటీ:కువైట్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. సరిపోయినంతగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవటంతో వైరస్ వ్యాక్సిన్ అపాయింట్మెంట్ తేదీలను రీషెడ్యూల్ చేయనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిజానికి ఫైజర్-బయోన్టెక్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తొలి విడత డోసులకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది కువైట్. అయితే..ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి ఫైజర్ కంపెనీకి కుప్పలు తెప్పలుగా ఆర్డర్లు రావటం...డిమాండ్ కు తగినట్లు ప్లాంట్ లో ఉత్పత్తి లేకపోవటంతో ఒప్పందం మేరకు అందివాల్సిన డోసులు ఇంకా కువైట్ కు చేరుకోలేదు. త్వరలోనే సెకండ్ బ్యాచ్ వస్తుందని కువైట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఫైజర్ నుంచి తమకు ఉన్న సమాచారం మేరకు వైరస్ వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది కువైట్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ