భారత్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు
- January 23, 2021జెనీవా:కరోనాను కట్టడి చేయడంలో భారత్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇప్పటికే మన దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ భారత్లో జనవరి 16 నుంచి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలకు టీకాలు ఇవ్వడంతో పాటు విదేశాలకు కూడా పెద్ద మొత్తంలో టీకాలు ఎగుమతి అవుతున్నాయి. కష్టకాలంలో సుహృద్భావంతో నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మాల్దీవులు, సీషెల్స్ దేశాలకు మనదేశం ఉచితంగానే టీకాను అందజేస్తోంది. బ్రెజిల్తో పాటు పలు దేశాలకు టీకాలు పంపిణీ చేస్తున్నారు. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ దేశాల్లో వ్యాక్సిన్కు రెగ్యులేటరీ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఆ దేశాలకు కూడా వ్యాక్సిన్ను ఎగుమతి చేయనున్నారు. ఈ క్రమంలో భారత్పై WHO ప్రశంసలు కురిపించింది.
''కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలకు సాయం చేస్తున్నందుకు ఇండియాకు, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఒకరికొకరం సాయం చేసుకుంటూ, కలిసికట్టుగా పోరాడితేనే వైరస్ను నిర్మూలించగలుగుతాం. ప్రజల ప్రాణాలు, జీవితాలను కాపాడలుగుతాం.'' అని WHO డీజీ డెడ్రోస్ గ్యాబ్రియేసస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం