కొత్త విద్యా విధానాల్ని అందిపుచ్చుకున్న బహ్రెయిన్ ఇండియన్ స్కూల్
- January 27, 2021మనామా:భవన్స్ - బహ్రెయిన్ ఇండియన్ స్కూల్, విద్యార్థులకు అకడమిక్ ఎక్సలెన్స్ అందించడమే కాకుండా, కో-స్కాలస్టిక్ పొటెన్షియల్ సాధించేలా కొత్త విద్యా విధానాల్ని అందిపుచ్చుకుంది. కొత్త టీచింగ్ అలాగే లెర్నింగ్ విధానాల్ని అందుబాటులోకి తెచ్చామనీ, 2020 ఓ ఛాలెంజింగ్ ఇయర్ కావడంతో, దాన్ని సద్వినియోగం చేసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆన్లైన్ విధానంతో విద్యాభ్యాసం మాత్రమే కాకుండా, విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాల్ని ఎప్పటికప్పుడు తీర్చగలిగినట్లు సంస్థ పేర్కొంది. విద్యార్థుల ఇళ్ళ వద్దకే పుస్తకాల్ని పంపించడం ద్వారా ఈ కేటగిరీలో మొట్టమొదటి స్కూల్గా ఆవిర్భవించింది బిఐఎస్. స్కూళ్ళకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన విద్యార్థుల కోసం అక్టోబర్ నుంచే ప్రత్యక్షంగా క్లాసులను నిర్వహిస్తున్నారు. యాన్యువల్ అవార్డ్ సెర్మానీ, సీియర్ సెకెండరీ వింగ్ ప్రకటన వంటి కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?