ద్వైపాక్షిక సంబంధాల పై ప్రధాని మోదీతో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ సంభాషణ
- January 29, 2021యూఏఈ:భారత ప్రధాని నరేంద్ర మోదీతో అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ బలగాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ఫోన్ లో మాట్లాడారు. ఇటీవలె 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న భారత్ కు యూఏఈ తరపున మొహమ్మద్ బిన్ జయాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఇరు దేశాల మైత్రితో పాటు అంతర్జాతీయ పరిణామాలు, కోవిడ్ సవాళ్లపై డిస్కస్ చేశారు. కోవిడ్ గడ్డుకాలాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకారాన్ని కొనసాగించాలని అభిలాశించారు. ఆర్ధిక, వాణిజ్య, సాంకేతికత, విద్యుత్, ఇంధన రంగాల్లో రెండు దేశాల పరస్పర సహకారం ఇరు దేశాల ప్రజలు లబ్ధి కలిగిస్తుందని అన్నారాయన. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ బిన్ జయాద్ కు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని మోదీ..యూఏఈతో మైత్రి బంధాన్ని బలపర్చుకునేందుకు భారత్ ఎప్పుడూ సానుకూల భావనతోనే ఉంటుందని అన్నారు. అవకాశం ఉన్న పలు రంగాల్లో పరస్పరం పెట్టుబడులకు సులభ మార్గాలను ఏర్పర్చటం ద్వారా దైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..