జజీరా ఎయిర్ లైన్స్:కువైట్-ఇండియా ఫ్లైట్ టికెట్ ఆఫర్...
- January 29, 2021
కువైట్ సిటీ:కువైట్ నుంచి ఇండియాలోని నాలుగు నగరాలకు ప్రయాణించే ప్రయాణికులకు జజీరా ఎయిర్ లైన్స్ ఆఫర్లు ప్రకటించింది. సగటున 15 వేల రూపాయలతో ఇండియాలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కొచ్చి ప్రయాణించేలా టికెట్ రేట్లను ఫిక్స్ చేసింది.

భారత్ తో పాటు ఇతర ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా జజీరా టికెట్ ఆఫర్లను ప్రకటించింది. ఖాట్మండు, ఢాకా, లాహోర్, దోహా, దుబాయ్, మస్కట్, అమ్మన్, దమ్మమ్, ఇస్తాంబుల్, జెడ్డా, రియాద్ ప్రయాణాలపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే..ప్రయాణికులు బయల్దేరే ముందు కువైట్ ఆరోగ్య శాఖ సూచించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అలాగే గమ్యస్థాన దేశాలు ప్రకటించిన నిబంధనల పట్ల కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని జజీరా ఎయిర్ వేస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







