ద్వైపాక్షిక సంబంధాల పై ప్రధాని మోదీతో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ సంభాషణ
- January 29, 2021యూఏఈ:భారత ప్రధాని నరేంద్ర మోదీతో అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ బలగాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ఫోన్ లో మాట్లాడారు. ఇటీవలె 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న భారత్ కు యూఏఈ తరపున మొహమ్మద్ బిన్ జయాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఇరు దేశాల మైత్రితో పాటు అంతర్జాతీయ పరిణామాలు, కోవిడ్ సవాళ్లపై డిస్కస్ చేశారు. కోవిడ్ గడ్డుకాలాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకారాన్ని కొనసాగించాలని అభిలాశించారు. ఆర్ధిక, వాణిజ్య, సాంకేతికత, విద్యుత్, ఇంధన రంగాల్లో రెండు దేశాల పరస్పర సహకారం ఇరు దేశాల ప్రజలు లబ్ధి కలిగిస్తుందని అన్నారాయన. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ బిన్ జయాద్ కు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని మోదీ..యూఏఈతో మైత్రి బంధాన్ని బలపర్చుకునేందుకు భారత్ ఎప్పుడూ సానుకూల భావనతోనే ఉంటుందని అన్నారు. అవకాశం ఉన్న పలు రంగాల్లో పరస్పరం పెట్టుబడులకు సులభ మార్గాలను ఏర్పర్చటం ద్వారా దైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…