ద్వైపాక్షిక సంబంధాల పై ప్రధాని మోదీతో అబుధాబి క్రౌన్ ప్రిన్స్ సంభాషణ
- January 29, 2021
యూఏఈ:భారత ప్రధాని నరేంద్ర మోదీతో అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ బలగాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ఫోన్ లో మాట్లాడారు. ఇటీవలె 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న భారత్ కు యూఏఈ తరపున మొహమ్మద్ బిన్ జయాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఇరు దేశాల మైత్రితో పాటు అంతర్జాతీయ పరిణామాలు, కోవిడ్ సవాళ్లపై డిస్కస్ చేశారు. కోవిడ్ గడ్డుకాలాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకారాన్ని కొనసాగించాలని అభిలాశించారు. ఆర్ధిక, వాణిజ్య, సాంకేతికత, విద్యుత్, ఇంధన రంగాల్లో రెండు దేశాల పరస్పర సహకారం ఇరు దేశాల ప్రజలు లబ్ధి కలిగిస్తుందని అన్నారాయన. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ బిన్ జయాద్ కు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని మోదీ..యూఏఈతో మైత్రి బంధాన్ని బలపర్చుకునేందుకు భారత్ ఎప్పుడూ సానుకూల భావనతోనే ఉంటుందని అన్నారు. అవకాశం ఉన్న పలు రంగాల్లో పరస్పరం పెట్టుబడులకు సులభ మార్గాలను ఏర్పర్చటం ద్వారా దైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







