జజీరా ఎయిర్ లైన్స్:కువైట్-ఇండియా ఫ్లైట్ టికెట్ ఆఫర్...
- January 29, 2021కువైట్ సిటీ:కువైట్ నుంచి ఇండియాలోని నాలుగు నగరాలకు ప్రయాణించే ప్రయాణికులకు జజీరా ఎయిర్ లైన్స్ ఆఫర్లు ప్రకటించింది. సగటున 15 వేల రూపాయలతో ఇండియాలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కొచ్చి ప్రయాణించేలా టికెట్ రేట్లను ఫిక్స్ చేసింది.
భారత్ తో పాటు ఇతర ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా జజీరా టికెట్ ఆఫర్లను ప్రకటించింది. ఖాట్మండు, ఢాకా, లాహోర్, దోహా, దుబాయ్, మస్కట్, అమ్మన్, దమ్మమ్, ఇస్తాంబుల్, జెడ్డా, రియాద్ ప్రయాణాలపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే..ప్రయాణికులు బయల్దేరే ముందు కువైట్ ఆరోగ్య శాఖ సూచించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అలాగే గమ్యస్థాన దేశాలు ప్రకటించిన నిబంధనల పట్ల కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని జజీరా ఎయిర్ వేస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..