దుబాయ్ చేరుకునే విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- January 29, 2021
దుబాయ్:కోవిడ్ వేరియంట్స్ నేపథ్యంలో దుబాయ్ చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికుల ప్రొటోకాల్ ను అప్ డేట్ చేసింది దుబాయ్. పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ ఉంటేనే దుబాయ్ బయల్దేరేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణ సమయానికి 72 గంటల లోపు జారీ అయిన పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోని తీసుకుంటామని అధికారులు వివరించారు. జనవరి 31 నుంచి అప్ డేట్ అయిన మార్గనిర్దేశకాలు అమలులోకి రానున్నాయి. దుబాయ్ లో ల్యాండ్ అయిన తర్వాత మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే..యూఏఈ పౌరులు మాత్రం బయల్దేరే ముందు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిన అవసరం లేదు. యూఏఈ పౌరులు నేరుగా దుబాయ్ చేరుకున్న తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







