దుబాయ్ చేరుకునే విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- January 29, 2021దుబాయ్:కోవిడ్ వేరియంట్స్ నేపథ్యంలో దుబాయ్ చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికుల ప్రొటోకాల్ ను అప్ డేట్ చేసింది దుబాయ్. పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ ఉంటేనే దుబాయ్ బయల్దేరేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణ సమయానికి 72 గంటల లోపు జారీ అయిన పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోని తీసుకుంటామని అధికారులు వివరించారు. జనవరి 31 నుంచి అప్ డేట్ అయిన మార్గనిర్దేశకాలు అమలులోకి రానున్నాయి. దుబాయ్ లో ల్యాండ్ అయిన తర్వాత మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే..యూఏఈ పౌరులు మాత్రం బయల్దేరే ముందు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిన అవసరం లేదు. యూఏఈ పౌరులు నేరుగా దుబాయ్ చేరుకున్న తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ