తీవ్రవాద చర్య: 18 మందికి జైలు

- February 01, 2021 , by Maagulf
తీవ్రవాద చర్య: 18 మందికి జైలు

మనామా:బహ్రెయిన్‌లోని పలు కీలక ప్రాంతాల్లో బాంబులు పేల్చేందుకు ఓ తీవ్రవాద సంస్థతో చేతులు కలిపిన 18 మంది వ్యక్ుతలకు 5 ఏళ్ళ నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. 8 మంది నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విదించింది. ఇద్దరికి 15 ఏళ్ళ జైలు శిక్ష ఖరారైంది. మరో ఇద్దరికి పదేళ్లు, ఐదుగురికి ఐదేళ్ళ జైలు శిక్ష, ఒకరికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. కాగా, తొమ్మిదిమంది నిందితులు దేశం విడిచి పారిపోయారు. నిందితులంతా 17 నుంచి 37 ఏళ్ళ వయసు లోపు వారే. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ మద్దతుదారులుగా నిందితులపై ఆరోపణలు నిరూపించబడ్డాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com