ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- February 01, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో క్రమంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.. తాజా బులెటిన్‌ ప్రకారం.. ఏపీలో కొత్త కేసులు భారీగా తగ్గాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 21,922 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. 64 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతిచెందారు.. ఇదే సమయంలో 99 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,87,900కి చేరగా.. 7,154 మంది మృతిచెందారు.. ప్రస్తుతం 1,242 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు కరోనా బారినపడి 8,79,504 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, కరోనా టెస్ట్‌ల సంఖ్య 1,31,59,794కు పెరిగినట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com