ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- February 02, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి.ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,88,004 కి చేరింది.ఇందులో 8,79,651 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,197 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,156 కి చేరింది.ఇక పోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 147 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com