అవసరమైతేనే హెల్త్ సెంటర్లకు వెల్ళాలి: బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ
- February 03, 2021
మనామా:హెల్త్ మినిస్ట్రీ, తమ పౌరులు అలాగే రెసిడెంట్స్ ప్రభుత్వ హెల్త్ సెంటర్లకు అవసరమైతే తప్ప వెళ్ళడం తగ్గించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, హెల్త్ సెంటర్లకు వెళ్ళడం మానాలన్నది బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ తాజా సూచన.ప్రతి ఒక్కరూ ఆన్లైన్ విధానం ద్వారా అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవాల్సి వుంటుంది. హాట్లైన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.హెల్త్ సెంటర్లను విజిట్ చేసే క్రమంలో చిన్న పిల్లల్ని తమ వెంట తీసుకెళ్ళకూడదు. మైనర్ ఆపరేషన్స్ అలాగే మహిళలకు రెగ్యులర్ చెకప్లు వంటివాటిని తాత్కాలికంగా రీ-షెడ్యూల్ చేయడం జరిగింది. రిమోట్ కౌన్సిలింగ్ సర్వీస్ని వినియోగించుకోవాల్సిందిగా రోగులకు సూచిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







