అబుధాబి: ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై 35 వేల కేసులు నమోదు
- February 05, 2021
అబుధాబి:గతేడాది అబుధాబి పరిధిలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై 35,073 కేసులను నమోదు చేసినట్లు ట్రాఫిక్, పాట్రోలింగ్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. రోడ్డు అడ్డదిడ్డంగా లేన్లు మార్చటంతో పాటు వాహనం వాహనం మధ్య సరిపడినంత దూరాన్ని పాటించని వారిని గుర్తించి వారి వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. షాడో డ్రైవింగ్ తో పాటు ఇతర వాహనాలకు సైడ్ ఇవ్వటంలో నిర్లక్ష్యం, తగిన సూచనలు లేకుండా పక్క లేన్ లోకి దూసుకెళ్లటం వంటి అలక్ష్య ధోరణి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని..అలాంటి ఉల్లంఘనలను క్షమించే ప్రసక్తే లేదని అబుధాబి ట్రాఫిక్ విభాగం గతంలోనే హెచ్చరించింది. అయినా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను విడిపించుకోవాలంటే 5000 దిర్హామ్ లు జరిమానా చెల్లించాలని...ఫైన్ చెల్లించిన వాహనదారులు మూడు నెలల్లోపే తమ వాహనాలను తీసుకువెళ్లవచ్చని స్పష్టత ఇచ్చారు. ఒకవేళ ఫైన్ చెల్లించకుంటే వాహనాలను వేలం వేస్తామని హెచ్చరించారు. ఇక ఇతర వాహనాలతో తగినంత దూరాన్ని పాటించకుండా డ్రైవింగ్ చేసిన వారికి 400 దిర్హామ్ ఫైన్, 4 బ్లాక్ పాయింట్లు విధించినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







