అబుధాబి: ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై 35 వేల కేసులు నమోదు

- February 05, 2021 , by Maagulf
అబుధాబి: ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై 35 వేల కేసులు నమోదు

అబుధాబి:గతేడాది అబుధాబి పరిధిలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై 35,073 కేసులను నమోదు చేసినట్లు ట్రాఫిక్, పాట్రోలింగ్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. రోడ్డు అడ్డదిడ్డంగా లేన్లు మార్చటంతో పాటు వాహనం వాహనం మధ్య సరిపడినంత దూరాన్ని పాటించని వారిని గుర్తించి వారి వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. షాడో డ్రైవింగ్ తో పాటు ఇతర వాహనాలకు సైడ్ ఇవ్వటంలో నిర్లక్ష్యం, తగిన సూచనలు లేకుండా పక్క లేన్ లోకి దూసుకెళ్లటం వంటి అలక్ష్య ధోరణి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని..అలాంటి ఉల్లంఘనలను క్షమించే ప్రసక్తే లేదని అబుధాబి ట్రాఫిక్ విభాగం గతంలోనే హెచ్చరించింది. అయినా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను విడిపించుకోవాలంటే 5000 దిర్హామ్ లు జరిమానా చెల్లించాలని...ఫైన్ చెల్లించిన వాహనదారులు మూడు నెలల్లోపే తమ వాహనాలను తీసుకువెళ్లవచ్చని స్పష్టత ఇచ్చారు. ఒకవేళ ఫైన్ చెల్లించకుంటే వాహనాలను వేలం వేస్తామని హెచ్చరించారు. ఇక ఇతర వాహనాలతో తగినంత దూరాన్ని పాటించకుండా డ్రైవింగ్ చేసిన వారికి 400 దిర్హామ్ ఫైన్, 4 బ్లాక్ పాయింట్లు విధించినట్లు అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com