బహ్రెయిన్ లో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్..కరోనా కట్టడికి కార్మిక శాఖ ఆదేశాలు
- February 07, 2021
మనామా:కరోనా కట్టడికి ఆంక్షలను కఠినతరం చేస్తోంది బహ్రెయిన్. ఇందులో భాగంగా కార్మిక, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు చర్యలు చేపడుతోంది. ఇక నుంచి మంత్రిత్వ శాఖలో 70 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్ క్వార్టర్స్ తో పాటు కార్మిక శాఖలోని కార్యాలయాల్లో విధులు నిర్వహించే వాళ్లంతా రేపటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభించొచ్చని ఆదేశించింది. కార్మిక శాఖలో సేవలు పొందాలనుకునే వీలైనంత వరకు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్ వినియోగించాలని అధికారులు సూచించారు. హాట్ లైన్ నెంబర్ 80008001కి కూడా కాల్ చేసి వివరాలు పొందవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







