యూఏఈలో కరోనా ఎఫెక్ట్...ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం

- February 07, 2021 , by Maagulf
యూఏఈలో కరోనా ఎఫెక్ట్...ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం

గల్ఫ్ దేశాలను సెకండ్ వేవ్ భయం వెంటాడుతోంది. దీంతో ఆంక్షలను కఠినతరం చేస్తూ వస్తున్నాయి. యూఏఈ కూడా ఇప్పటికే పలు రంగాలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగుల హజరును 30 శాతానికే పరిమితం చేసింది. మిగతా 70 శాతం మంది ఇంటి నుంచే పనులు నిర్వహించాలని ఆదేశించింది. 

అంతేకాదు...ఆఫీసులకు రాకుండా ఆన్ లైన్లోనే పనులు చక్కబెట్టగలిగే రంగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో వందకు వంద శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేసుకోచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 60 ఏళ్లు దాటిన వారు..దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఎంచుకోవాలని యూఏఈ ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com